మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. మళ్ళీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాల షూటింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. హీరోయిన్ తో పాటు ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కోల్కతాలో జరుగుతుంది. 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమాతో పాటు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లను కూడా లైన్లో పెట్టాడు చిరంజీవి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నాడు చిరంజీవి.సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత సైలెంట్ అయిన ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు మరోవైపు ఈ సినిమా కోసం నటినట్టులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం.

అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ సినిమాలో పాత్ర కోసం హీరోలను పరిశీలించారట. చిత్ర బంధం ఆఖరికి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాలో డీజే టిల్లు ఫెమ్ సిద్దు జొన్నలగడ్డ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది .సిద్దు జొన్నలగడ్డ హీరోగా మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. కేవలం ఒక సినిమాతోనే ఈయన అరెంజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈయన డీజే టీల్లు సీక్వెల్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాతో పాటు చిరంజీవి సినిమాలో సైతం నటించబోతున్నాడు సిద్దు జొన్నలగడ్డ. అయితే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు చిత్ర బృందం ఇవ్వలేదు. దీంతో వీరి అభిమానులు అధికారిక ప్రకటన కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: