తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు.. మొదట ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న పూజ హెగ్డే ఆ తర్వాత..DJ, గద్దల కొండ గణేష్, అలా వైకుంఠపురం, అరవింద సమేత, మహర్షి తదితర చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ క్రేజ్ తోని ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి పలు సినిమాలలో అవకాశాలు అందుకున్న పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.


దీంతో పూజ హెగ్డే కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది.. ముఖ్యంగా ఈమె నటించిన స్టార్ హీరోల చిత్రాలు బిస్ట్, రాధే శ్యామ్, బాలీవుడ్ చిత్రాలు కూడా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూశాయి. దీంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఈమెకు అవకాశాలు కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. ప్రస్తుతం ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది.ఇందులో కూడా మరొక హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తోంది. చిన్న వయసులోని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన మరొక హీరోయిన్ కృతి శెట్టి.. మొదట ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే కుర్రకారులను ఆకట్టుకుంది. ఆ తరువాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.


ఇక తర్వాత ది వారియర్, సుధీర్ బాబు తో ఒక సినిమా, మాచర్ల నియోజకవర్గం, నాగచైతన్య తో కస్టడీ సినిమా వంటివి  ఘోరమైన డిజాస్టర్ గా మిగిలాయి దీంట్లో ప్రస్తుతం ఏమి కెరీర్ కూడా చాలా డౌన్ అయ్యిందని చెప్పవచ్చు. వీరిద్దరికి సరైన సక్సెస్ పడితే కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమన్నట్లుగా పలువురు నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. మరి తమ తదుపరి చిత్రాలను ఆచితూచి అడుగులు వేస్తూ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: