తెలుగు, తమిళ్లో సినిమాలు చేస్తూ వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. తమిళ తంబిలకు అన్న అని అభిమానంగా పిలుచుకొంటూ వస్తున్నారు. తెలుగులో సినిమా హిట్ అయినా కాకపోయినా కూడా తమిళ్లో సినిమాలు మాత్రం ఇక్కడ తిరుగులేదు.అందుకే ఏ సినిమా వెలుగులోకి వస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం రజిని దర్బార్ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో రజినికి జోడిగా నయనతారసినిమా ల నటిస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. దర్బార్సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు రజిని గారులాంటి పెద్ద హీరోల పోస్టర్ మోషన్ రిలీజ్ చేయడం అంటే మాములు విషయం కాదు అంటూ ప్రిన్స్ వెల్లడించారు. దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్తో పాటు మొత్తం చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
‘
దర్బార్’ మోషన్ పోస్టర్ అదిరిపోయింది. పోలీస్ ఆఫీసర్ లుక్లో రజినీకాంత్కెవ్వు కేక అంతే. దీనికి తోడు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో స్థాయిలో ఉంది. మొత్తంగా ఈ ఒక్క పోస్టర్తో మంచి హైప్ క్రియేట్ చేయగలిగారు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. రజినీకాంత్, మురుగదాస్ కాంబోలో వస్తోన్న తొలి చిత్రం ఇది.ఇక రజిని కి ఈ సినిమా 167 వ సినిమా. పాతికేళ్ల తరువాత పోలీస్ గా నటిస్తున్నారు.
సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుంది. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రమిది. ఇప్పటి వరకు ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’ చిత్రాల్లో రజినీకి జోడిగా నయనతార నటించారు. కాగా, ‘దర్బార్’ తమిళ మోషన్ పోస్టర్ను లోకనాయకుడు కమల్ హాసన్ విడుదల చేశారు.తమిల్లో లోకనాయకుడు రిలీజ్ చేయగా, తెలుగులో మహేష్ బాబు రిలీజ్ చేశారు.