స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అల వైకుంఠపుర ములో సినిమాలో నటించారు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు .. అది కూడా బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరి చేస్తున్నా ఈ సినిమా అందరిలోనూ ఆశలు రేపుతుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల అయిన అన్నీ ఈ సినిమా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లారు అని వేరేలా చెప్పనక్కర్లేదు..
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మొత్తానికి పాటలన్నీ ఈ సినిమా పై అంచనాలను పెంచాయి..
ఇక్కడ మురళీశర్మ పిల్లలను మార్చేస్తాడు. తనకు పుట్టిన సుశాంత్ను టబు పిల్లోడిగా పెట్టేసి... వాళ్లకు పుట్టిన బన్నీని తాను తీసేసుకుంటాడు... అంటే ఒకేసారి ఉద్యోగంలో చేరిన రామచంద్ర కంపెనీ ఓనర్ అవ్వడంతో మురళీశర్మ తట్టుకోలేక పిల్లలను మార్చేస్తాడు. ఒకేసారి పుట్టిన పిల్లలను మార్చడంతో తన పిల్లోడు కోటీశ్వరుడిగా ఉండాలని కోరుకుంటాడు ఇదే లైన్ ఎన్టీఆర్ ఆదుర్స్ సినిమాలో ఉంటుంది..
వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా మూడోవది.. గతంలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి రెండు సినిమా భారీ హిట్ ను అందుకున్నాయి.. దీంతో ఇప్పుడు వచ్చిన అల వైకుంఠపురం లో సినిమా కూడా హిట్ అందుకున్నట్లు అని సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ వస్తోంది.. రెండేళ్ల నుండి హిట్స్ లేని బన్నీకి ఈ సినిమా హిట్ గా నిలవడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..కలెక్షన్స్ ఈ మాత్రం ఉంటాయో చూడాలి..