యంగ్ హీరో నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన తాజా చిత్రం భీష్మ. నితిన్ దాదాపు ఏడాది విరామం తరువాత చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నితిన్ గత మూడు చిత్రాలు ఫెయిల్ కావటంతో ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టు గా మంచి కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ కుడుముల తొలి సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అదే జోరులో నితిన్ తో సినిమా ఓకె చేయించుకున్నాడు.
ఆ తరువాత దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన వెంకీ, నితిన్ను దిల్ సినిమా టైంలో ఉన్నంత ఎనర్జీ తో చూపించేందుకు రెడీ అయ్యాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందంటున్నారు ఆడియన్స్. కథ పెద్దగా లేకపోయినా కామెడీ మాత్రం సూపర్బ్ అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నితిన్, రష్మిక, సంపత్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్బ్ అంటున్నారు.
అయితే కథ పరంగా ఇది కొత్త కథేం కాదన్న టాక్ వినిపిస్తోంది. రొటీన్ కథకు కామెడీ కోటింగ్ ఇచ్చి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడంటున్నారు. కథలో ట్విస్ట్, టర్న్ లు అన్ని ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగినా కామెడీ అన్నింటిని కవర్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ప్రకారం, భీస్మ డిసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ అంటున్నారు ఆడియన్స్. మరి ఈ టాక్తో నితిన్ ఈ సినిమాను ఏం మేరకు సక్సెస్ చేస్తాడో చూడాలి.