ప్రభాస్ ఎవరు ఊహించని విధంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేసే విషయంలో ప్రభాస్ ను అశ్వినీ దత్ చాల తెలివిగా ఒప్పించాడు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు ప్రభాస్ సందీప్ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చడంతో ఇంచుమించు ఆ కథకు ఓకె చేసాడు అన్న వార్తలు వచ్చాయి. 


అయితే ఈ మూవీని ప్రభాస్ సందీప్ రెడ్డిల కాంబినేషన్ లో నిర్మించాలని ప్రయత్నాలు చేసిన నిర్మాతలు ప్రభాస్ కు 50 కోట్లు పారితోషికంగా ఆఫర్ చేసినట్లు టాక్. అయితే ఈ విషయాలను పసిగట్టిన నిర్మాత అశ్వినీ దత్ ప్రభాస్ ను కలిసి నాగ్ అశ్విన్ తీయబోయే మూవీలో నటించడానికి ప్రభాస్ ఒప్పుకుంటే అతడికి 60 శాతం వాటా ఈమూవీ బిజినెస్ లో ఇస్తానని వాగ్దానం చేసినట్లు తెలుస్తోంది.


ఈ మూవీని నాగ్ అశ్విన్ పాన్ ఇండియా మూవీగా తీయబోతున్న నేపధ్యంలో ఈ మూవీ పెట్టుబడి 200 కోట్లు పక్కకు తీసివేసినా ఈమూవీకి జరిగే 400 కోట్ల బిజినెస్ లో ప్రభాస్ కు తనవంతు షేర్ గా 100 కోట్లకు పైగా పారితోషికం వస్తుంది అన్న అంచనాలతో ప్రభాస్ వెంటనే నాగ్ అశ్విన్ అశ్విని దత్ ల ప్రాజెక్ట్ కు ఓకె చేసాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 


త్వరలోనే నాగ్ అశ్విన్ దీపికను కలిసి ఈ సినిమా కథను చెప్పబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే దీపిక తొలిసారి నటించబోయే తెలుసు సినిమా ప్రభాస్ మూవీ మాత్రమే అవుతుంది. టైమ్ మిషన్ నేపధ్యంలో ఉండబోయే ఈ మూవీ కథ వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించి చాల వెరైటీగా ఉంటుంది అని టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: