బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్గా మారింది జబర్దస్త్. ఈ షో మొదలై ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఈ షో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బుల్లితెరకు పరిచయమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. నవ్వుల నవాబు నాగబాబు వెళ్లిపోయినప్పుడు హాట్ టాపిక్ అయిన జబర్దస్త్ ఇప్పుడు.. దొరబాబు, పరదేశీ సెక్స్ రాకెట్ లో దొరికిపోవడంతో మళ్లీ హిటెక్కింది. ఓ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహంపై పోలీసులు రైడ్ చేయడంతో జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి అడ్డంగా దొరికిపోయారు.
అయితే వీళ్లు తమను అరెస్ట్ చేయవద్దని పోలీసుల కాళ్లు పట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. దాంతో ఇండస్ట్రీలో వీళ్ల గురించి చర్చ బాగానే జరుగుతుందిప్పుడు. దాంతో పాటు వీళ్లేనా ఇంకా ఎవరైనా ఈ స్కామ్లో ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇలా కక్కుర్తి పడ్డందుకు ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ల భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు దొరబాబు, పరదేశిలను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తొలగించినట్టు పలు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దొరబాబు హైపర్ ఆది టీమ్లో స్కిట్స్ చేయడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక హైపర్ ఆది స్కిట్లో కొత్తగా వచ్చి చేరాడు పరదేశీ. గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న పరదేశీ.. ఈ మధ్య కాలంలో బాగానే పాపులర్ అయ్యాడు. మరోవైపు ఈ ఇద్దరి విషయంలో మల్లెమాల ప్రొడక్షన్స్ సీరియస్గానే స్పందించినా కూడా వాళ్లు మాత్రం నిజానికి చాలా మంచి వాళ్లే అని సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ల విషయంలో తుది నిర్ణయం మాత్రం హైపర్ ఆదికి వదిలేసినట్లు తెలుస్తుంది. దీంతో హైపర్ ఆది ఈ ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆదికి దొరబాబు, పరదేశీతో పరిచయం ఉండటంతో వాళ్లు ఏంటనేది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈ వేడి చల్లారేంత వరకు కొన్ని వారాల పాటు వాళ్లను జబర్దస్త్కు దూరం పెట్టి.. ఆ తర్వాత మళ్లీ తీసుకురావాలని హైపర్ ఆది చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.