ప్రస్తుతం కరోనా వైరస్.. ప్రపంచదేశాల్లోనూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది ప్రాణాలను ఈ బలి తీసుకున్న ఈ వైరస్ రోజురోజుకు దూకుడు పెంచుకుంటూ పోతోంది. ఈ మహమ్మారి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.. ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. అయినప్పటికే వెనుకడుగు వేయకుండా ప్రపంచదేశాలు ఈ రక్కసితో పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. అందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. భారత్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21 వేలు దాటింది.
వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 4,257 మంది కోలుకున్నారు. అలాగే కరోనా సోకి మృత్యవాడ పడినవారి సంఖ్య 681కు చేరుకున్నారు. ఇక ఇప్పటికే భారత్లో లాక్డౌన్ పొడిగించడంతో పాటు ప్రభుత్వాలు కఠన చర్యలు చేపట్టాయి. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మరోవైపు షూటింగ్స్ లేక సెలబ్రెటీలు సైతం ఇంటిపట్టునే ఉంటున్నారు. పైగా పనివాళ్లు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నారు. ఎపుడు ఇంట్లో వంటింటి ముఖం వైపు చూడని హీరో, హీరోయిన్లు, దర్శకులు ఇపుడు ఇంట్లో ఒక రోజు గిన్నెలు తోమి, ఇళ్లు తుడుస్తున్నారు.
ఇక దర్శకుడు సందీప్ రెడ్డి ప్రారంభించిన ‘బి ది రియల్ మేన్’ విసిరిన ఛాలెంజ్ను ప్రస్తుతం ట్రెండింగ్లో నడుస్తుంది. అయితే తాజాగా ఇంట్లోనే ఉంటున్న దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఫ్యామిలీ కోసం వంటింట్లో గరెట పట్టారు. అది కూడా పిల్లలతో కలిసి మరీ వంటంట్లో బిర్యాని చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ విడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కాగా, ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో ఓ సినిమా పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్కు బ్రేక్ పడింది. మే 3వరకు లాక్ డౌన్ ఉండడంతో ఆ తరువాత పరిస్థితులను బట్టి షూటింగ్ లను స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
Director #BoyapatiSrinu cooking for family in this #QuarantineTime. He is happily enjoying the kitchen work with kids.#StayHomeStaySafe#CoronaLockdown #IndiaFightsCoronavirus pic.twitter.com/RFzZy1lYUW
— Vamsi Shekar (@UrsVamsiShekar) April 23, 2020