ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ తరహా కథను లాక్ చేశారని రాజమౌళి తదుపరి చిత్రం ఇదేనని ప్రచారమవుతోంది.అయితే ఈ మూవీలో కథానాయకుడు ఎవరు? అంటే .. ఇప్పటికే మహేష్ హీరోగా రాజమౌళి సినిమా క్యూలో ఉంది. అంటే ఛత్రపతిగా నటించేది మహేష్ బాబు అని మరో ప్రచారం వేడెక్కిస్తోంది.అయితే ఇది నిజమా? అంటే ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ అయితే లేదు. చాలామంది ఈ న్యూస్ ని కొట్టి పారేసినా ..కొంతమంది మాత్రం ఇందులో వాస్తవం కూడా ఉండొచ్చు కదా అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఛత్రపతికి నార్త్ కనెక్టివిటీ ఉండడం..
సౌత్ లోనూ పాపులారిటీ ఉన్న రారాజు కావడంతో మరో హిస్టారికల్ పాన్ ఇండియా ప్రాజెక్టుతో మన రాజమౌళి సంచలనాలు సృష్టించడం ఖాయమేనన్న చర్చా ఇప్పుడు ఇండ్రస్టీ లో వేడెక్కిస్తోంది.ఇక మరోవైపు ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత ఆ రేంజు సినిమా తీయడమే కరెక్ట్ అన్న వాదన కూడా తాజాగా తెరపైకొచ్చింది.మరి నిజంగా rrr తర్వాత రాజమౌళి.. మన మహేష్ బాబు తో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తే.. ఇక మహేష్ ఫ్యాన్స్ కి ఇక పండగే.. మరి ప్రస్తుతం ప్రచారమౌతున్న ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే మరి కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు...!!