ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా చేసిన సినిమా అ!. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రశాంత్ వర్మ రెండో సినిమా కల్కితో డైరక్షన్ పరంగా సూపర్ అనిపించుకున్నాడు. ఇక తన థర్డ్ ప్రాజెక్ట్ గా అ! సినిమా సీక్వల్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సీక్వల్ లో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 


అ! సినిమాలో కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ నటించారు. ఈ సినిమా సీక్వల్ లో కాజల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ వర్మ. అంతేకాదు ఈసారి కథ కూడా ప్రయోగాత్మకంగా ఉంటుందట. అ! సినిమానే అందరు ఆశ్చర్యపడేలా చేయగా ఇక మరో ప్రయోగం అంటే తప్పకుండా ఈసారి కూడా ప్రశాంత్ వర్మ తన టాలెంట్ చూపిస్తాడని అంటున్నారు. 


అయితే ఈ ప్రాజెక్ట్ కు నిర్మాత ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ సమాచారం ప్రకారం అ! సీక్వల్ లో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి.  


రీసెంట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో కూడా విలన్ గా చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ నుండి విజయ్ తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. ఏది ఎలా ఉన్నా అ! సీక్వల్ లో విజయ్ సేతుపతి నటిస్తే కనుక ఆ ప్రాజెక్ట్ కు అదనపు ఆకర్షణ వచ్చినట్టే లెక్క. మరి ప్రశాంత్ వర్మ వారిని ఒప్పించే కథ సిద్ధం చేశాడా లేదా అన్నది చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: