చైనా దేశం వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని తన ఉనికితో అతలాకుతలం చేసేసింది. దీని పేరు వింటేనే భయపడేంతగా తన ఉధృతిని కొనసాగిస్తోంది. ఈ కరోనా వైరస్ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ వారిని మరణానికి మరింత చేరువచేస్తోంది. దీనికి వ్యాక్సిన్ తయారుచేయడానికి ప్రపంచ దేశాలు తలమునకలైవున్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కరోనాకి వాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని చెబుతున్నారు. మరి అప్పటివరకు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు ప్రజలకు తెలియచేస్తున్నాయి. ఇప్పుడు దీనిప్రభావం మరింతగా పెరిగిందని తాజా సమాచారం ప్రకారం తెలిసింది. మరి ఏమిటో ఆ సమాచారం కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.  

తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3,30,46,292 కరోనా కేసులు నమోదయ్యాయి. దీని ప్రభావంతో ఇప్పటి వరకు 9,98,275 మంది మృతి చెందారు. అటు కోలుకున్న వాళ్లు కూడా 2,44,01,389 మంది ఉండగా, ఇటు మన భారత్‌లోనూ కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. నిన్న (శనివారం) కొత్తగా 85,362 కరోనా కేసులు నమోదు కాగా, అత్యధికంగా 1,089 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 59,03,933 కు చేరాయి. ఈవార్తతో ప్రజల్లో ఆందోళన తారాస్థాయికి చేరింది.

మనదేశంలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి కరోనాతో 93,379 మంది మృతి చెందగా, యాక్టివ్‌ కేసులు 9,60,969 ఉన్నాయి. ఈ వైరస్ బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వాళ్లు ఇప్పటి వరకు దేశంలో 48,49,585 మంది ఉన్నారు. అటు, అగ్రదేశం అమెరికా సహా ప్రపంచ దేశాల్లోనూ కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. మరి దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని కోరుకుందాము.  

మరింత సమాచారం తెలుసుకోండి: