ఏపీలో జగన్ సారధ్యంలోని వైసీపీ 2019 లో ప్రత్యర్ధులు కూడా ఊహించిన విధంగా విజయఢంకా మోగించి... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ పాలనలో ఇప్పటికే మూడు సంవత్సరాలు గడిచిపోయింది. అయితే జగన్ పాలనపై మిశ్రమ స్పందన వస్తున్నా... ప్రజల్లో మాత్రం తాను తీసుకు వచ్చిన నవరత్నాలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా జగన్ కాబినెట్ ను రెండు పర్యాయాలుగా పెట్టుకున్నారు. చెప్పిన విధంగానే రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ను మార్చగా కొత్తముఖాలు చాలా మంత్రులుగా మారారు. కాగా మొదటి సారి మంత్రివర్గంలో ముగ్గురిని మహిళా మంత్రులుగా చేయగా... ఈ సారి మరొక్కరిని కలుపుకుని నలుగురు మహిళలకు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు జగన్.

వీరిలో ఆర్కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనిత మరియు విడదల రజినీలు ఉన్నారు. అయితే వైసీపీ కమాండ్ నుండి మరియు కొన్ని సర్వే ల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ నలుగురు మహిళా ఎమ్మెల్యే లలో ది బెస్ట్ ఎవరు అన్నదానికి మొదటి సారి మంత్రి వర్గంలోకి వచ్చిన విడదల రజిని పేరు వినిపిస్తోంది. అయితే మిగిలిన ముగ్గురు కూడా ఏదో ఒక నెగటివిటీ తో మైలేజ్ రావడం లేదు. అందులో రోజా ఎప్పటిలాగే నిత్యం మంత్రి ని అని మర్చిపోయి వాదనలకు దిగడం వలన విమర్శల పాలవుతోంది. ఇక ఉష శ్రీ చరణ్ అయితే ఎమ్మెల్యే గా చేసిన శ్రమ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది అని అంటున్నారు. మంత్రిగా ప్రజలకు చాలా దూరంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక తానేటి వనిత సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైలైట్ అవుతోంది.

కాగా వీరి ముగ్గురికన్నా కూడా ది బెస్ట్ గా తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా చేసుకుంటూ వెళుతోంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే గా గెలిచిన విడదల రజినీ మంత్రి కాక ముందు దూకుడుగా ఉన్నప్పటికీ.. మంత్రిగా అయ్యాక మాత్రం ఎంతో హుందాగా నడుచుకుంటూ... అటు పార్టీ కార్యక్రమాలను ఇటు వైద్య శాఖ మంత్రిగా అన్ని విషయాలలో చొరవ తీసుకుని ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది. అందుకే సీఎం జగన్ దృష్టిలో కూడా మంచి మంత్రిగా పేరు తెచ్చుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: