సినీ హీరోగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని గత ఎనిమిది సంవత్సరాల క్రితం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల ముందుకు వచ్చాడు. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ పడుతూ లేస్తూ ప్రజల అభిమానాన్ని పొందడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. గత ఎన్నికల్లో మొదటిసారి కాంటెస్ట్ చేయగా పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెంది, ఓవరాల్ గా కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచి పరువును పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తరచూ ప్రజల మధ్యకు వెళ్లి ఏదో కొంత అభిమానాన్ని పొందుతున్నాడు అని చెప్పాలి. అలా వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో రీసెంటుగా ఉత్తరాంధ్ర జిల్లా విశాఖలో జరిగిన ఒక ఘటన వలన జనసేనకు మైలేజీ తగ్గేలా ఉంది.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు రాఘవరావు చేసిన ఘనకార్యం గురించి తెలిసిందే. ఈయన జనసేన పార్టీలో ఉన్న కీలక నాయకులు నాదెండ్ల మనోహర్ మరియు నాగబాబులకు సుపరిచుతుడని తెలిసిందే. వివిధ సమయాలలో వీరితో ఫోటోలు కూడా తీసుకున్నవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే రాఘవరావు చినవాల్తేరులోని ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న ఒక మైనర్ బాలికకు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ , ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేక మానసికంగా బాధపడుతూ ఉండేది.

అయితే ఈ సైలెన్స్ ను అనువుగా తీసుకున్న రాఘవరావు నీతో మాట్లాడాలి రూమ్ కు వస్తావా ? నువ్వంటే ఇష్టం ... నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్న వరకు విషయం వెళ్లిందట. దీనితో కోపోద్రిక్తులైన అమ్మాయి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రఘ్వరావు పై ఐపీసీ సెక్షన్ 354 , 509 మరియు 427 ల కింద కేసును నమోదు చేశారు. ఇది కాస్తా గత మూడు రోజుల నుండి వైరల్ గా మారింది. అందుకే జనసేనను ఉద్దేశించి అందరూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పవనన్న ఇలాంటి వాళ్ళను పార్టీలో పెట్టుకుంటే జనసీకు ఉన్న విలువ కూడా పోతుంది అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి వాళ్లకు మీ పార్టీలో చోటు ఇవ్వొద్దు అంటూ జనసైనికులు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.  








మరింత సమాచారం తెలుసుకోండి: