ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మే 28 వ తేదీన పార్లమెంట్ కొత్త భవనాన్ని స్టార్ట్ చేయనున్నారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త పార్లమెంటును ప్రారంభించనున్నారు.అయితే అంతకు ముందు ఉదయం 7 గంటల నుంచి ఈ భవన పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 7:30 నుండి 8:30 దాకా  పూజ ఉంటుంది. గాంధీ విగ్రహం దగ్గర పూజల  ఏర్పాటు చేస్తారు.ఇక ఈ పూజలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. అలాగే దీని తరువాత, లోక్‌సభ లోపల ఉదయం 8:30 నుండి 9 గంటల మధ్య సెంగోల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా అంతే కాకుండా ఆదిశివుని,ఆదిశంకరాచార్యులను పూజించే అవకాశం కూడా ఉంది.పొద్దున పూజలు, హవనాల అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండో విడత కార్యక్రమం ప్రారంభమవుతుంది.తరువాత రెండో దశ కార్యక్రమాన్ని జాతీయ గీతాలాపనతో ప్రారంభిస్తారు.


ఈ సందర్భంగా రెండు లఘు చిత్రాల ప్రదర్శన కూడా అక్కడ జరగనుంది.ఆ తరువాత ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ చదువుతారు. ఇక ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఔక్ కూడా ప్రసంగిస్తారు.చివర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి ప్రసంగం ఉంటుంది.ఇంకా ఈ సందర్భంగా నాణెం, స్టాంపును కూడా విడుదల చేయనున్నారు. తరువాత చివర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ఇక దీనితో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల ప్రాంతంలో కార్యక్రమం ముగుస్తుందని భావిస్తున్నారు.అయితే ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మేరకు దేశంలోని జాతీయ కాంగ్రెస్ సహా మొత్తం 19 పార్టీలు మే 28 వ తేదీన జరిగే కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం నాడు నిర్ణయించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: