భారత దేశ రాజధాని నగరం ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చి అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే 22 సంవత్సరాల గల ఒక యువకుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఎందుకంటే.. ఆ ఇరవై రెండేళ్ల నిందితుడు శుక్రవారం రోజు ఒక 55 ఏళ్ల మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. ఆపై హతమార్చాడు. ఈ సంఘటన ఉత్తర ఢిల్లీలోని గులాబీ బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

అయితే శనివారం పొద్దున పూట.. ఆ మహిళ అర్థనగ్నంగా చనిపోయి ఒక ఫ్లోర్ పై పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఈ ఘాతుకం ఎవరు చేసి ఉంటారోనని తెలుసుకోవడానికి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ను పరిశీలించగా.. ఒక వ్యక్తి చనిపోయిన ముసలమ్మ ఇంటిలో నుంచి బయటికి వెళ్తున్నట్టు పోలీసులుకు కనిపించింది. ఆ వ్యక్తి ఎవరు అని చుట్టుపక్కల నివాసులని విచారించగా.. అతను ధర్మరాజు అని వాళ్ళు తెలిపారు..దీంతో ఈ కేసును పోలీసులు ఇట్టే చేధించారు.


ఆ ఇరవై రెండేళ్ల నిందితుడు ధర్మరాజ్.. కిష్ణగంజ్ కాలనీలో నివసిస్తున్నాడు.. అరెస్టయిన ధర్మరాజ్ తానే అత్యాచారం, హత్య చేశానని గులాబీ బాగ్ పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నాడు.

పోలీసులు చెప్పిన ప్రకారం... ధర్మరాజు బాగా మద్యం సేవించి.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాధితురాలైన(మృతురాలు) ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించాడు.. ఆ తర్వాత ఆమెను... గొంతు గట్టిగా పిసికి చంపే ముందు... అత్యంత కిరాతకంగా మానభంగం చేశాడు.

ఆ 55 ఏళ్ల పెద్దావిడని ఎందుకు చంపావురా? అని పోలీసులు ప్రశ్నించగా.. ' నేను ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత..నా మొహం మీద ఉమ్మి వేసింది సార్.. అందుకే కోపం వచ్చి ఆమె గొంతు గట్టిగా పిసికి చంపేసాను,.. సార్' అంటూ సమాధానమిచ్చాడు ఈ నిందితుడు.


మృతురాలి ఇంటికి సమీపంలో ఉన్న ఒక స్వీట్ షాప్ లో ధర్మరాజ్ కొన్ని రోజుల క్రితం పని చేసి.. ఆ తర్వాత మానేశాడు అని తెలిసింది. అయితే అతడు పనిచేసే సమయంలో.. మృతురాలు తరచుగా స్వీట్ షాప్ కి వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ధర్మరాజు ఆమెపై కామవాంఛ పెంచుకున్నాడు. ఈ సంఘటన చూస్తే.. పుట్టిన పాప దగ్గరనుంచి.. ముసలమ్మల వరకు ఈ దేశంలో రేపిస్టుల నుంచి ఏమాత్రం సేఫ్టీ లేదని స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: