వైసిపి పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన సి.రామచంద్రయ్య చంద్రబాబు చేస్తున్నది పోరాటం కాదని అమరావతి ప్రాంతంలో తన వర్గీయుల కోసం కూడగట్టిన ఆస్తులను కాపాడుకోవడం కోసం చేస్తున్నది చంద్రబాబు ఆరాటం అని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ పై వ్యక్తిగత ద్వేషాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మధ్య సమస్యలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని కానీ చంద్రబాబు చెబుతున్న మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ అవసరమని పేర్కొన్నారు.

 

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు హయాంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ద్వారా వేల కోట్ల రూపాయలు చంద్రబాబు వర్గీయులు మరియు అనుచరులు దండుకున్నారు అని ఆరోపించారు. ఇంకా తన అనుకూల మీడియా ద్వారా అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు అన్నట్టుగా చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారని సోషల్ మీడియాలో కూడా టిడిపి అనుచరవర్గం ఇదే రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ...పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని చంద్రబాబు దర్శకత్వంలో పనిచేస్తున్నారని..అమరావతి ప్రాంతంలో రైతులను రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ కూడా వ్యవహరిస్తున్నారని కుట్రలు పన్నుతున్నారని...ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలక్షన్ లో ఓడించడంతో పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుగుదేశం మరియు బిజెపి పార్టీ ల మధ్య పవన్ కళ్యాణ్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని.... ఎంతో భారీ మెజారిటీతో గెలిపించిన ఏపీ ప్రజలకు అద్భుతమైన సంక్షేమ పరిపాలన అందిస్తున్న జగన్ పై చాడీలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేపట్టారని కానీ రాజకీయాల్లో కనీసం ఎమ్మెల్యేగా గెలవని పవన్ కళ్యాణ్ ని ఢిల్లీలో ఎవ్వరూ సరిగ్గా పట్టించుకోలేదని సి.రామచంద్రయ్య తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.

 

ప్రస్తుతం రాజకీయాల్లో రాణించలేక బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడని..ఎన్నికల ముందు వరకు బిజెపి పార్టీ ని దారుణంగా విమర్శించి చంద్రబాబు దర్శకత్వంలో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపి టిడిపికి వ్యతిరేకంగా అన్నట్టుగా ప్రజలను నమ్మించడానికి పవన్ ప్రయత్నాలు చేశారు కానీ ఎన్నికలలో ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్ కి దిమ్మ తిరిగిపోయే ఓటు రూపంలో సరైన తీర్పు ఇచ్చారు అంటూ సి.రామచంద్రయ్య మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: