కబ్జాలను రెవెన్యూ వింగ్ తో కలిసి ఆపకపోయినా
ఆగక పొంగే కన్నీళ్లే నీ వరాలు అని చెప్పి
అమరావతి మహిళా రైతును ఈడ్చి ఈడ్డి తన్నినా
అన్నీ కూడా ఏపీ పోలీసు ఖాతాలో ఉండేవే కానీ..
ఆయన చేసిన ఉత్తమ మరియు అత్యుత్తమ సేవా రీతి
ఏంటన్నది ఇప్పుడిక ఓ ప్రశ్నకు సంకేతం
సందేహాలకు నిలయం.. అయినా కూడా!
గౌరవ డీజీపీని గౌరవించుకుందాం,గౌరవించుకుంటాం కూడా!
విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడుపుతున్న డీజీపీకి మనం సెల్యూట్ చేయాలి.పోలీసు ఎస్కార్టు వాహనాల్లో టీడీపీ కార్యాలయానికి రౌడీలను తరలించిన గొప్ప కార్యం ఒకటి ఆయన చేసినందుకు మనం వందనాలు చెల్లించాలి.వీలుంటే అదనపు అభినందలు కూడా అందించాలి.రాష్ట్రంలో క్రైం ఒక స్థాయిలో పెరిగి పోయినా కూడా నియంత్రణకు నోచుకోలేని సందర్భాలను చూసి మరియు విని నవ్వుకోవాలి.రౌడీలు రెచ్చిపోయి రంకెలు వేస్తుంటే,అమాయకుల ఇళ్లపై దాడులు చేస్తుంటే మేరా డీజీపీ మహాన్ అనే చెప్పుకుని అవార్డు అందుకుంటున్న వేళ చప్పట్లు కొట్టి ప్రోత్సాహం అందించడం వైసీపీతో సహా మిగతా అన్ని పార్టీల మరియు ప్రజా సంఘాల,మహిళాసంఘాల సంఘటిత బాధ్యత.
రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిపోయినా, లేదా అనుకున్న వృద్ధిలో నేరాల నియంత్రణ లేకపోయినా డీజీపీని మాత్రం దేశంలోనే అతిగొప్ప స్థాయి ఆఫీసర్ గానే గుర్తించి గౌరవం అందించడం అన్నది ఈ ఏడాది ఆరంభంలో విన్న శుభవార్త.అందుకు వారు అర్హులు అని చెబుతున్నారు ద బెటర్ ఇండియా సంస్థ నిర్వాహకులు.కఠినమయిన సవాళ్లను సైతం ఆయన ఎదుర్కొని, ఎదురొడ్డి నిలిచి కాలానికి ఎదురేగి వెళ్లి అనుకున్నది సాధించారన్నది వాళ్ల ప్రశంస.అనుకూల వర్గాల మీడియా మాట.
సొంత డబ్బా కొంచెం కాదు ఎక్కువే కొట్టాలన్నది ఓ రూల్ గా పెట్టుకుంది మా మరియు మన గౌరవ వైసీపీ సర్కారు మరియు సాక్షి పేపరు.రెండక్షరాల పేపరు దేశంలో ఏ అరాచకం జరిగినా స్పందించదు కానీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సర్ ను మాత్రం అమాంతొం పొగడ్తలతో ముంచెత్తుతోంది.దేశంలోనే ఉత్తమ సేవలు అందించిన రీతికి సన్మార్గ రీతికి సంకేతంగా ఆయనను గత ఏడాదికి సంబంధించి ఉత్తమ డీజీపీగా ఎంపిక చేశామని ద బెటర్ ఇండియా సంస్థ చెబుతున్న మాట. 2021లో దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను రూపొందించి, త్వరలో వారిని సత్కరించున్నామని ప్రకటించింది నిన్నటి వేళ.