అవధాన సారం నుంచి వైద్య విజ్ఞానం వరకూ
కిన్నెర పాట నుంచి ఇంకా
ఇతరేతర సాంస్కృతిక వైవిధ్యం వరకూ
తెలుగు వాకిట సంబరం ఈ పురస్కార వైభవం
అవధానిగా గరికిపాటి నరసింహారావు సుపరిచితులు. తెలుగు భాషపై వారికున్న ప్రేమ అనితరం. పద్మ పురస్కారం అందుకున్న సందర్భంగా వారి గురించి ఇంకొంత.. గరికిపాటి నరసింహారావు అవధానిగా, ప్రవచన కర్తగా తెలుగు రాష్ట్రాలలోఎంతో పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పద్య రీతిని సులువుగా బోధించడంలో ఆధ్యాత్మిక విషయాలను వివేచన చేయడంలో వీరు సిద్ధ హస్తులు. తెలుగు వారి కి ప్రాణ ప్రదం, ప్రత్యేకం అయిన అవధాన ప్రక్రియతో ఎంతో పేరు తెచ్చుకున్నవారు. ముఖ్యంగా వీరి ప్రసంగాల్లో కానీ ప్రవచనాల్లో కానీ వాస్తవ దూర విషయాలు అనేవి ఉండనే ఉండవు. వీలున్నంత మేర హృదయాలను హత్తుకునే భాష మరియు సౌందర్యం మిళితం అయి ఉంటాయి. పద్మ పురస్కారం అందుకుంటున్న వేళ వీరికి అభినందనలు.వీరితో పాటు తెలుగు వారయిన కృష్ణ ఎల్లా దంపతులు, అదేవిధంగా కిన్నెర వాద్య కళాకారులు దర్శనం మొగులయ్య కూడా పద్మ పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు. వీరికి తెలుగు నేలకు ఉన్న బంధం గురించి ప్రత్యేకించి చెప్పాలి.