సాధారణంగా ఎవరైనా సరే ప్రియురాలికి తమ మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఎంతో స్పెషల్ గా ప్రపోజ్ చేస్తే ప్రియురాలు తప్పకుండా తమ ప్రేమను అంగీకరిస్తోంది అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ప్రియురాలికి ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఇక ఇటీవల కాలంలో అయితే క్రికెట్ స్టేడియం లో ప్రియురాలి కి ప్రపోజ్ చేయడం లాంటి ఘటనలు ఎక్కువగా తెరమీదికి వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు పక్కనే ఉన్న ప్రియురాలికి ఒక రింగ్ ఇచ్చి విల్ యు మ్యారి మీ అంటూ అడుగేస్తూ ప్రపోజ్ చేస్తున్నారు.


 అయితే కేవలం ప్రేక్షకులు మాత్రమే ఇలా చేస్తున్నారు అనుకుంటే పొరపాటే.. క్రికెటర్లు కూడా ఇక ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా స్టార్ క్రికెటర్గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ సైతం ఒకానొక  సమయంలో తన ప్రేయసికి  ఇలాగే స్టేడియంలో ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత మరి కొంత మంది క్రికెటర్లు కూడా ఇలాగే స్టేడియంలో ప్రపోజ్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇప్పుడు మరోసారి ఇలాంటిదే చేసి వార్తల్లో నిలిచాడు మరో  క్రికెటర్.  ప్రస్తుతం ఆసియా కప్ లో భాగంగా అన్ని మ్యాచులు ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉన్నాయి.


 ఇండియా హాంగ్కాంగ్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా హాంకాంగ్ బ్యాట్స్మెన్ మెన్ కించిత్ షా  స్టేడియంలోని తన గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఇండియా తో మ్యాచ్ ముగిసిన తర్వాత వెంటనే స్టాండ్స్  లోకి వెళ్లిన  కించిత్ అక్కడ కూర్చొని మ్యాచ్  వీక్షిస్తున్న ప్రేయసికి  తన జేబులో ఉన్న రింగ్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. మోకాళ్ళ మీద కూర్చుని తన ప్రేమను వ్యక్త పరిచాడు. దీంతో ఆశ్చర్యానికి లోనైన సదరు యువతి ఆ తర్వాత అతని ప్రేమను అంగీకరించింది.  ఇందుకు  సంబంధించిన వీడియో  ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: