2023 ఏడాదిలోనే అటు భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వన్డే వరల్డ్ కప్ టైటిల్ పై అన్ని జట్లు కన్నేసాయి అని చెప్పాలి. అయితే భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కి అటు పాకిస్తాన్ రాబోతుందా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఇదే ఏడాది ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉంది. ఇరు జట్లు కూడా ఒక దేశ పర్యటనకు మరో దేశం వెళ్లక ద్వైపాక్షిక సిరీస్ లు ఆడక దశాబ్దాలు గడిచిపోతున్నాయి.


 ఇలాంటి సమయంలో ఇక పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఆసియా కప్ లో భారత జట్టు పాల్గొంటుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే  పాకిస్తాన్ పర్యటనకు రాకపోతే ఇక తాము కూడా టీమిండియాలో జరగబోయే వరల్డ్ కప్ లో ఆడబోము అంటూ ఇప్పటికే ఎంతోమంది పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా పాకిస్తాన్ జట్టు అటు వరల్డ్ కప్ లో ఆడేందుకు భారత పర్యటనకు వస్తుందో లేదో అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 భారత్ వేదికగా ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ గెలవడమే తమ లక్ష్యం అంటూ కెప్టెన్ బాబర్ అజాం చెప్పుకొచ్చాడు. ఇక ఈ ప్రపంచ కప్ గెలిచి ఇక తమ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని భావిస్తున్నాను అంటూ గొప్పలకు పోయాడు పాక్ కెప్టెన్ బాబర్ అజం. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ అనంతరం ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. బాబర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. స్వదేశంలో టీమిండియానే హాట్ ఫేవరెట్ మీకు అంత సీన్ లేదు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: