ఇకపోతే సాధారణంగా క్రికెట్ ఆటగాళ్ల జెర్సీ ని సొంతం చేసుకోవాలని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఇలాంటి అదృష్టం వస్తే అస్సలు మిస్ చేసుకోరు. అయితే ఇప్పుడు ఇలాంటి ఒక అదృష్టమే వేచి చూస్తుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు జెర్సీ సొంతం చేసుకునే అవకాశం మీ కోసం సిద్ధంగా ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అప్పుడప్పుడు సమాజ హితం కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే దేశంలో పచ్చదనాన్ని పెంపొందించాలానే ఉద్దేశంతో ఆకుపచ్చ రంగు జెర్సీ వేసుకుని ప్రతి ఏడాది ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఆడుతూ ఉంటుంది ఆర్ సి బి. ఇటీవలే కరోనా వారియర్స్ కి గుర్తుగా పి పి ఈ కిట్ రంగు అయిన నీలిరంగులో జెర్సీ వేసుకొని ఒక మ్యాచ్ ఆడేందుకు సిద్దం అయింది.
ఇక ఇప్పుడు మరో గొప్ప పనికి సిద్ధమైంది ఆర్సిబి జట్టు. వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి లేని నిరుపేదలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించేందుకు ఆర్సిబి యాజమాన్యం తమ ఆటగాళ్ల జెర్సీలను వేలం వేసేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ వేలం పాట కొనసాగుతుంది అంటూ ఇటీవల స్పష్టం చేసింది ఇక వేలంలో విజేతలుగా నిలిచిన వారు తమ అభిమాన ఆటగాళ్ళ ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీ లను సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపింది. Fankind.Ord/rcb లో పూర్తి వివరాలు ఉంటాయి అంటూ తెలిపింది