ఈరోజు తాజాగా రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5g స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇక ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు తో పాటు ఐసిఐసిఐ బ్యాంకు కార్డు ఉన్నవారు కూడా భారీ డిస్కౌంట్ తో ఈ మొబైల్ ను సొంతం చేసుకోవచ్చు. ఎవరైతే సరికొత్తగా ఫైవ్ జీ మొబైల్ కొనాలని ఆలోచిస్తున్నారో అలాంటి వారికి ఇది ఒక సదవకాశం అని చెప్పవచ్చు. ఇకపోతే సాంసంగ్ గెలాక్సీ 23 5 జీ స్మార్ట్ఫోన్ సేల్ ఈ రోజు ప్రారంభం కానుంది . కాబట్టి అధికారిక వెబ్సైట్ ఫ్లిప్ కార్ట్ తో పాటు రిటైల్ స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్.. 120 HZ డిస్ ప్లే తో పాటు 50 మెగా పిక్సల్ తో పాటు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ లాంటి ప్రత్యేకతలు కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో మనకు అందుబాటులో ఉండనున్నాయి.ఇకపోతే పోయిన సంవత్సరం విడుదలైన సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 మోడల్ ను అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు తాజాగా సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5 G మొబైల్ ను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ధర మార్కెట్లో రూ.17,499.. ఇప్పటికే ఈ బడ్జెట్లో మనకు రెడ్మీ నోట్ 11 టీ 5 జీ, రియల్ మీ 9ప్రో, మోటోరోలా జీ 71 ఇలాంటి బ్రాండెడ్ మోడల్ స్కూల్ ప్రస్తుతం సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ గట్టిపోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 4 జీ బీ ర్యామ్ + 128 జీ బీ స్టోరేజ్ వేరియంట్ తో ఈ మొబైల్ ధర రూ.17,499 కాగా 6 జీ బీ+128 జీ బీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.18,499. ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు కొనుగోలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: