ఇటీవల కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకోవడానికి స్కూల్లు కాలేజీలకు పంపిస్తే.. అక్కడికి వెళ్లి చదువుకోవడం తప్ప మిగతా అన్ని పనులు చేసేస్తూ ఉన్నారు విద్యార్థులు. ఇలా కాలేజీకి వెళ్ళిన విద్యార్థులు చేస్తున్న పనులు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ప్రేమ దోమ అంటూ చెడు తిరుగుళ్లు తిరగడమే కాదు ఏకంగా ఒక అబ్బాయి కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీద కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ గా మారిపోతూ ఉన్నాయి.


 ఏకంగా నడిరోడ్డు మీద అందరూ చూస్తున్నారు అనే విచక్షణ కూడా మరిచిపోయి ఏకంగా సిగపట్లు పట్టుకొని దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకుంటున్న వీడియోలు అందరిని అవ్వక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటికే ఇలాంటి తరహా వీడియోలు చాలానే వెలుగులోకి రాగా.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. ఏకంగా నలుగురు అమ్మాయిలు  నడి రోడ్డుపై దారుణంగా తన్నుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది అని చెప్పాలి. నాసిక్ లోని ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు క్లాస్ అనంతరం క్యాంటీన్ కు వెళ్లారు.

 అయితే క్యాంటీన్లో కుర్చీల విషయంలో ఒకరితో ఒకరు గొడవకు దిగారు. దీంతో అక్కడే వాదనకు దిగి వ్యవహారం తిట్లు తన్నుకునే వరకు వెళ్ళింది. కానీ క్యాంటీన్ సిబ్బంది వారించి వెంటనే అక్కడి నుంచి బయటికి పంపించారు. అయితే బయటికి వచ్చిన తర్వాత కూడా అమ్మాయిలు మరోసారి వాదన చేసుకున్నారు. దీంతో విచక్షణ కోల్పోయి ఇక తాము రోడ్డు మీద ఉన్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయి బూతులు తిట్టుకుంటూ దారుణంగా ఇక సిగపట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఇక ఇలా నలుగురు అమ్మాయిలు కొట్టుకుంటుంటే అక్కడికి గుంపుగా చేరిన అబ్బాయిలు తెగ ఎంజాయ్ చేస్తూ కేకలు పెట్టడం ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: