భారత దేశంలో పండగలకు ప్రత్యేకత ఉంది.. పండుగలను జరుపుకోవడం మాట అటుంచితే చాలా రకాల వస్తువుల పై భారీ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి.. దీంతో ప్రజలు కూడా ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్ లను కూడా అందిస్తారు. ప్రస్తుతం దసరా సీజన్ నడుస్తుండటంతో ఆఫర్లు, డిస్కౌంట్లతో హడావిడి మొదలైంది. ముఖ్యంగా వాహనాలు, ఎలెక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే వారికి ఈ సీజన్ బొనాంజా  ఆఫర్ అని చెప్పాలి.



ఈ మేరకు మహీంద్రా సంస్థ తన వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. రాయితీలు, అన్ని ప్రయోజనాలు కలుపుకొని దాదాపుగా మూడు లక్షల వరకు డిస్కౌంట్ ను అందించనుంది. ఆ ఆఫర్లను ఇటీవల లాంచ్ అయిన మహీంద్రా థార్ ఎస్ యూవీపై కూడా ఇచ్చిందీ సంస్థ. కార్ మోడల్ , వేరియంట్ తో కలిపి రూ . 25 వేల నుంచి 3 లక్షల వరకు భారీ డిస్కౌంట్ ను అందించనుంది. మహీంద్రా కు సంబంధించిన చాలా కార్లకు భారీ తగ్గింపు లు అందిస్తుంది. వాటి వివరాల విషయానికొస్తే..



మహీంద్రా బొలేరోపై రూ.25,500ల వరకు ఆఫర్ అందివ్వనుంది. ఇక క్యాష్ డిస్కౌంట్ రూ.12,000, ఎక్స్ ఛేంజ్ బెనిఫిట్లు, కార్పోరేట్ ప్రయోజనాలు అన్ని కలుపుని రూ.13,500 వరకు, మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్ టీ, ఎక్స్ యూవీ 300 మోడళ్లపై రూ.29,500 వరకు అందివ్వగా.. రెండు కార్ల పై 25000 వేలకు డిస్కౌంట్ ను అందించనున్నట్లు మహీంద్రా యాజమాన్యం వెల్లడించింది.  ఇంకా మహేంద్ర కు సంబందించిన అన్నీ రకాల కార్ల పై డిస్కౌంట్ లను ఇవ్వనున్నట్లు తెలిపారు. మహీంద్రా స్కార్పియో పై 80 వేల వరకు డిస్కౌంట్ ను అందించనుంది. అందులో 20 వేల వరకు ఎక్స్ ఛేంజ్, కార్పోరేట్ రాయితీనిచ్చింది. మహీంద్రా ఫ్లాగ్ షిప్ ఎస్ యూవీ అల్తూరస్ జీ4 మోడల్ పై అత్యధికంగా 3 లక్షల వరకు డిస్కౌంట్ ను పెట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి: