బిహార్​ అసెంబ్లీ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న ఎన్డీఏకు, వారసత్వ రాజకీయాలను ఆరాధించే మహాకూటమికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సమస్తీపుర్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.


బిహార్ సీఎం నితీశ్​ కుమార్ బంధువులు ఎవరైనా రాజ్యసభలో ఉన్నారా? మోదీ కుటుంబీకులు ఎవరైనా పార్లమెంటులో ఉన్నారా?" అని ప్రజలను ప్రశ్నించారు ప్రధాని. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బిహార్​లో 1000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్​పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయ రంగంలో మౌలికసదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు మోదీ గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: