
బిహార్ సీఎం నితీశ్ కుమార్ బంధువులు ఎవరైనా రాజ్యసభలో ఉన్నారా? మోదీ కుటుంబీకులు ఎవరైనా పార్లమెంటులో ఉన్నారా?" అని ప్రజలను ప్రశ్నించారు ప్రధాని. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బిహార్లో 1000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయ రంగంలో మౌలికసదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు మోదీ గుర్తు చేశారు.