నిన్న ఘట్‌ కేసర్‌లో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా ఆయన పోలీసుల సాయంతో పారిపోయినంత పని చేశారు. పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించి ఉండకపోతే.. మరింత ఘోరంగా అవమానం జరిగేదని సభకు వచ్చిన వారు అభిప్రాయపడుతున్నారు.


అయితే ఈ దాడి వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర ఉందంటున్నారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నాననే కారణంగానే ఆయన తన అనుచరుల ద్వారా దాడి చేయించాడని ఆరోపిస్తున్నారు. ఇలాంటి చిల్లర మల్లర చర్యలకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేందుకు కంకణబద్ధులై ఉన్నారని మంత్రి మల్లారెడ్డి అంటున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పినట్టు రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని.. తాను ఆవిషయం చెబుతుంటేనే నినాదాలు చేశారంటూ మంత్రి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: