కొందరు ఎంత తాజాగా ఉండాలి అనుకున్న సరే.. తాజాగా ఉండలేరు.. జుట్టు పాడవుతుంది.. అలాంటి వారికీ ఈ చిట్కాలు ఎంతైనా అవసరం. అందుకే చర్మం రోజంతా తాజాగా నిగనిగలాడేందుకు ఈ చిట్కాలు పాటించి మీ అందానికి మెరుగులు దిద్దాడు. రోజంతా తాజాగా ఉండండి..
ఎన్నిసార్లు తలస్నానం చేసిన జిడ్డు, మురికి వంటివి తలపై పేరుకుని పోతే జుట్టు కళ తప్పుతుంది. ఇంకా అలాంటి సమయంలో తలస్నానం చేశాక చివర్లో మగ్గునీళ్లల్లో కాస్త వంటసోడా కలిపి కడిగితే సరిపోతుంది.. జుట్టు ఆరోగ్యవంతంగా తయారయ్యి మెరిసిపోతుంది.
రెండు చెంచాల బియ్యప్పిండిలో టీ డికాక్షన్ నీరు, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కొంటే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారేది.
ముప్పావు కప్పు గులాబీ నీటిలో, పావు కప్పు గ్లిజరిన్, ఒక టేబుల్ స్పూన్ చొప్పున వెనిగర్, తేనె కలిపి సీసాలో వేసుకొని దాన్ని సన్స్క్రీన్ లోషన్గా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
పాలపొడిలో, నాలుగు చెంచాల కీరదోస ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, చిటెకెడు పసుపు మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కడిగేస్తే తాజా అనుభూతితో చర్మం మెరిసిపోతుంది.
మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని అందంగా మార్చుకోండి.