భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. భారతదేశంలో అత్యధిక కేసులు పెరిగిపోతున్న రాష్ట్రాలలో 4వ స్థానంలో ఉంది భారత దేశ రాజధాని ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా రోజు రోజుకి వందల్లోనే కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలందరూ తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఇక తాజాగా 472 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . అయితే ఈ రోజు నమోదైన కేసులు రికార్డు సృష్టించాయి అనే చెప్పాలి. ఢిల్లీ రాష్ట్రంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 472 కేసులు నమోదు కాలేదు. అంటే మొదటి సారి ఒకే రోజులో 472 కేసులు నమోదు కావడంతో అక్కడ మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను అక్కడి ఆరోగ్య అధికారులు అధికారికంగా వివరణ ఇచ్చారు.