వరంగల్ జిల్లాలో గొర్రెకుంటలో వలసకార్మికుల మృతి కేసులో మిస్టరీ వీడిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కొన్ని రోజుల క్రితం మక్సూద్ మనవడి బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో బీహార్ యువకులకు స్థానిక యువకులకు గొడవ జరిగింది. మక్సూద్ కూతురు విషయంలో ఈ గొడవ జరిగింది. 

 

మక్సూద్ కూతురు బూస్రా భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్దనే కొన్ని రోజుల నుంచి ఉంటుంది. ఈ నేపధ్యంలోనే ఆ కుటుంబం పై విష ప్రయోగం  జరిగింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ కోణం లోనే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 5 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇంకా ఏమైనా బావిలో ఉన్నాయా అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: