ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్​ మహీంద్రా మరోమారు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఒడిశాలో ప్రమాదక రీతిలో ప్రవహిస్తున్న కాలువను దాటేందుకు నిత్యం కష్టపడుతున్న ఇద్దరు అంగన్​వాడీ కార్యకర్తలకు.. పడవలు అందించేందుకు ముందుకొచ్చారు.మల్కాన్​గిరి జిల్లా రాలేగడ గ్రామ పచాయతీకి చెందిన ఇద్దరు మహిళలు.. అంగన్​వాడీ కేంద్రంలో పనిచేస్తున్నారు. అయితే అక్కడ రోడ్డు వసతులు లేవు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా కాలువ ప్రమాదక రీతిలో ప్రవహిస్తూ ఉంటుంది.



ప్లాస్టిక్​ క్యాన్లు, ఇతర వస్తువులను నడుముకు కట్టుకుని కాలువ దాటి విధులను నిర్వర్తిస్తున్నారు ఈ మహిళలు.ఇటీవలే ఈ పూర్తి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ నేపథ్యంలో వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు... 'మహీంద్రా మెరైన్'​ సంస్థ రూపొందించిన పడవలు ఉపయోగపడతాయా? అని అడిగారు ఆనంద్​ మహీంద్రా.


మరింత సమాచారం తెలుసుకోండి: