దేశవ్యాప్తంగా ఎంట్రీ ఆపరేషన్​(ఒక రకమైన హవాలా) పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నవారి ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం నుంచి ఐటీ శాఖ సోదాలు కొనసాగిస్తోంది. హవాలా ఆపరేటర్​​ సంజయ్​ జైన్​, అతని సంబంధీకుల నుంచి లెక్కలు చూపని రూ. 62 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది.


2016 నవంబర్​ 8న చేసిన నోట్ల రద్దు తర్వాత దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో నగదు జప్తు చేసినవాటిల్లో ఇది భారీ మొత్తమని అధికారులు తెలిపారు. ఢిల్లీ సహా పంజాబ్​, హరియాణా, ఉత్తరాఖండ్​, గోవాల్లో 42 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.హవాలా ఆపరేటర్​​ సంజయ్​ జైన్​, అతని సంబంధీకుల నుంచి రూ.62 కోట్ల నగదు జప్తు చేశారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా ఎంట్రీ ఆపరేషన్​ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న పలువురి ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: