గాంధీ ఆసుపత్రిలో ఒక అద్భుతం జరిగింది. 110 ఏళ్ళ వయసు కలిగిన ఒక వృద్ధుడు కరొనను జయించి బయటపడ్డాడు. ఇంత వయసు కలిగిన వ్యతి కరోనా పై పోరులో విజయం సాధించడం మన దేశంలో ఇదే తొలిసారి. కీసర ఆశ్రమం లో నివాసం ఉంటున్న రామానంద తీర్ధ అనే వృద్ధుడు స్వల్ప కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరగా మూడు వారాల తర్వాత కరోనా నెగటివ్ వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు మాట్లాడుతూ నిజంగా ఇదొక అద్భుతం అని కొనియాడారు. ఆయనకు కరోనా తప్ప మిగతా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం వల్లనే ఇది సాధ్యం అయ్యింది అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: