దేశంలో వ్యాక్సిన్ విక‌టించి తొలిమ‌ర‌ణం న‌మోదైంది. అంతే కాకుండా వ్యాక్సిన్ విక‌టించ‌డం వ‌ల్లే వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని కేంద్రం అధికారికంగా దృవీకరించింది. మార్చి 8న తొలిడోసు తీసుకున్న 68 ఏళ్ల వృద్ధుడు మృతి చెంద‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. క‌రోనా వ్యాక్సిన్ డోసు తీసుకోవ‌డం వ‌ల‌న వ‌చ్చిన రియాక్ష‌న్‌తో చ‌నిపోయిన‌ట్లు కూడా కేంద్రం స్ప‌ష్టం చేసింది. అయితే గ‌తంలోనూ వ్యాక్సిన్ తీసుకున్న త‌ర‌వాత ప‌లువురు చ‌నిపోయారంటూ వార్త‌లు వ‌చ్చాయి. కానీ వారు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. కానీ దేశంలో తొలిసారి వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన రియాక్ష‌న్ కార‌ణంగా చనిపోయినట్టు కేంద్రం ప్ర‌క‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: