ఖాజీపూర్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గంగానదిలో ఎవరో దుర్మార్గులు పసిపాపను వదిలేశారు. చెక్క పెట్టెలో నెలల వయసు ఉండే అమ్మాయిని ఉంచి నీటిలో వదిలారు. అంతే కాకుండా చెక్క పెట్టె పై దేవత ఫోటోను, జాతకాన్ని ఉంచారు. పసిపాప ఏడుపు శబ్దం వినిపించడంతో స్థానికులు పాపను రక్షించారు. ఈ ఘటన స్థానికులను కలచి వేసింది. తల్లి దండ్రులు ఇలా పాపను నదిలో వదిలారా లేదంటే ఇతరులు ఎవరైనా ఈ పని చేశారా అన్నది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా అమ్మాయి అవ్వడం వల్లే పాపను ఇలా వదిలేశారా అన్నది కూడా తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: