పెట్రోల్ ధరలు రోజు రోజులకూ పెరిగి పోతూ సామన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు వణికిపోతున్న జనం ఇప్పుడు బండి తీయాలన్నా భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టి మరింత ముందుకు వెళ్ళిపోతోంది. ఇక ఈరోజు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రో ప్రొడక్ట్స్ అయిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. 


తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 100.46 రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర 95.28 రూపాయలుగా ఉంది. ఇక మిగతా చోట్ల కూడా కొంచెం అటూ ఇటూగా అదే పరిస్థితి అలానే ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 102.98 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్  ధర  96.47 రూపాయలకు లభిస్తోంది. ఇక మిగతా చోట్ల కూడా కొంచెం అటూ ఇటూగా అదే పరిస్థితి అలానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: