ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ సంస్థ వినియోగ దారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది.. లాక్ డౌన్ సమయంలో కొత్త ఆఫర్లను అందిస్తున్నారు. అది కూడా తక్కువ ధరకే అందించి నెట్ వర్క్ లలో బేష్ అనిపించుకుంది. ఇప్పుడు మరో ఆఫర్ ను అందించింది.మీకోసం ఒక అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇదే చౌక ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్‌తో మొబైల్ నెంబర్ రీచార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. భారతీ ఎయిర్‌టెల్ రూ. 20లోపు అంటే రూ.19కే ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ అందిస్తోంది.


రూ.19 పెట్టి నెంబర్ రీచార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ ప్లాన్ వాలిడిటీ రెండు రోజులు . అంటే మీరు రూ.19 పెట్టి రీచార్జ్ చేసుకుంటే రెండు రోజులు ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు..రూ.19 రీచార్జ్ ప్లాన్‌ను ట్రూలీ అన్‌లిమిటెడ్ కేటగిరి కింద ఉంచింది. అంటే ఎంత సేపైన మాట్లాడుకోవచ్చని అర్థం చేసుకోవాలి. రూ.19 కే అన్‌లిమిటెడ్ కాల్స్ అంటే చెప్పుకో దగ్గ అంశం. కాల్స్‌తో పాటు డేటా కూడా లభిస్తుంది. 200 ఎంబీ డేటా వస్తుంది.



ఇంకెందుకు ఆలస్యం మీరు మీ నెంబర్ రీచార్జ్ చేసుకోవాలని భావిస్తే.. రూ.19 రీచార్జ్ ప్లాన్ ఒకసారి చూడండి.  ఇక పోతే మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.. ఎయిర్ టెల్ ఈ ఏడాది కస్టమర్లను పెంచుకుంటూ వచ్చింది. ఆ ఆఫర్ ఏంటంటే.. మూడు నెలలకు లేదా నెలకు వేయించుకొనే అవకాశం లేదు అనే వారికి ఈ ఆఫర్ సరిపోతుంది... 2698 ప్లాన్ ఒకటి అందుబాటు లో ఉంది. దీని వాలిడిటీ 365 రోజులు. రోజుకు 2 జీడీ డేటా వస్తుంది. ఇంకా డిస్నీ హాట్‌ స్టర్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ గా లభిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: