చైనా, భారత్ ల మధ్య ఇటీవల దైపాక్షిక చర్చలు జరిగాయి. షాంఘై కోపరేటివ్ మీటింగ్ ఇండియాలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ దేశాలు పాల్గొన్నాయి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చైనా, భారత్ రెండు దేశాలు మళ్లీ విడిగా చర్చించుకున్నాయి. చైనా విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి ఇద్దరు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏదైతే గాాల్వాన్ లోయలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. గాల్వాన్ లోయలో ఇరు దేశాల బలగాలు వెనక్కి వెళ్లాలని గతంలోనే జరిగిన 18 సమావేశాల్లో అనుకున్నారు. కానీ ఇంతవరకు అక్కడి నుంచి రెండు దేశాలకు సంబంధించిన బలగాలు వెనక్కి వెళ్లడం లేదు.


కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. చైనా భారత్ ను ముందు వెళ్లాలని కోరుతున్నారు. భారత్ చైనా వెళ్లాలని కోరుతోంది. గాల్వాన్ లోయలో సెక్యూరిటీ పెంచడం వల్ల  భారత్ కు ప్రతి రోజు రూ. 5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. అయినా భారత్ ఎక్కడ కూడా ఈ విషయంలో తగ్గేది లేదని చెబుతోంది. ప్రస్తుతం జరిగిన సమావేశంలో భారత్ తన భూభాగాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్లదని జై శంకర్ తేల్చి చెప్పారు.


చైనా నే వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్ ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు డ్రాగన్ కంట్రీ పన్నిన కుట్రగా మేధావులు అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ కంట్రీ తన కుయుక్తులతో ఇండియాకు రోజు రూ. 5 కోట్లకు పైగా ఖర్చయ్యేలా చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా దెబ్బతీయొచ్చని భావిస్తోంది. కానీ భారత్ భూభాగాన్ని అస్సలు వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు. ఎంత ఖర్చయినా సరే.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అస్సలు తగ్గేది లేదని అంటోంది.


ప్రత్యేకంగా సమావేశమైన సమయంలో కూడా జై శంకర్ చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపి కుండ బద్దలు కొట్టారు. ముందు చైనా బలగాలే గాల్వాన్ లోయలో వెనక్కి వెళ్లాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: