రష్యా అధ్యక్షుడు పుతిన్ పై దాడి చేయాలని ఉక్రెయిన్ ప్రయత్నాలు చేసినట్టు ఆ దేశం ఆరోపిస్తోంది.. ఈ దాడి చేయడం సాధ్యం కాకపోవడంతో విఫలమైనట్టు తెలుస్తుంది.  రష్యా దీనితో రెచ్చిపోతోంది. పుతిన్ ని చంపాలని ప్రయత్నం చేసిన వారందరిని మట్టు పెడతాం అని ప్రకటించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని చెబుతున్నారు. రష్యన్ పెడరేషన్ ఆర్మీ భీకరమైన దాడులకు దిగుతోంది. దీని వల్ల ఉక్రెయిన్ కు చెందిన ఆర్మీ కమాండర్ మరణించారు. దీంతో ఉక్రెయిన్ ఆర్మీ అతడు వీర మరణం పొందడాని కీర్తిస్తోంది.


అదే సమయంలో రష్యన్  ఆర్మీ మాత్రం పోరాటంల విజయం సాధించామని గొప్పలు చెప్పుకుంటోంది. ఉక్రెయిన్ రివర్స్ ఎటాక్ లో క్రిమియాలో రైల్వే ట్రాక్ లను తగలబెట్టారు. 2014 లో క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. ఆ సమయంలో  ఉక్రెయిన్ పోరాటం చేయలేదు. కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ పోరాటం ఎక్కడి వరకు వెళుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. సరైన ఆయుధాలు లేవు. సైనికులు మరణిస్తున్నారు. తిండి దొరకడం లేదు. ఇలాంటి సమయంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సైనికులు రష్యా పై పోరాటం కొనసాగిస్తున్నారు.


ఉక్రెయిన్ ఏకంగా రష్యాఅధ్యక్షుడు పుతిన్ ను చంపాలని నిర్ణయించుకుంది. క్రెమ్లిన్ లోని రష్యా అధ్యక్ష భవనంలో పుతిన్ ను చంపితే యుద్దం ఆగుతుందని భావించి ఎటాకింగ్ కు దిగింది. దీన్ని రష్యా పసిగట్టి ప్రమాదం  జరగకుండా పుతిన్ ను  కాపాడుకుంది. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన పని అని గమనించి ఎలాగైన సరే అతడిని అంతమొందించాలని రష్యా నిర్ణయించుకుంది. దీంతో జెలెన్ స్కీ ప్రస్తుతం అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. క్రిమియా పై దాడిని రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. మరో వైపు ఉక్రెయిన్ సైనికులు, రష్యా ఆర్మీ కి మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఇది ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: