ఏ రోజు అయినా సరే గుడ్డు తినడం మంచిది అని చెబుతారు నిపుణులు. ఇందులో పోషకాలు ఎక్కువ. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ గుడ్డునే కొంతమంది ఉడకబెట్టి తీసుకుంటే మరి కొంతమంది ఉడకబెట్టి తింటుంటారు. మరి ఎలా తింటే ఎక్కువ లాభాలు ఇప్పుడు చూద్దాం.

 శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను గుడ్డు శరీరానికి అందిస్తుంది. కొందరు గుడ్డులోని పచ్చసొన తింటే కొవ్వు పెరిగిపోతుందని చెబుతుంటారు. కానీ, అందులో ఏ మాత్రం నిజం లేదు. అది కేవలం అపోహ మాత్రమే. మీరు గుడ్డును పెంకు తో సహా తినేసినా మంచిదే. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. గుడ్డును వేరుగా, గుడ్డు పెంకులను వేరేగా తీసుకుంటేనే మంచిది. అలా ఎందుకు చేయాలో తెలుసుకోవాలంటే.. కొన్ని అధ్యయనాల్లో పేర్కొన్న ఈ ఆసక్తికర విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.


 గుడ్డును ఉడికించిన తర్వాత లేదా, అమ్లెట్ వేసుకున్న తర్వాత పెంకులను పక్కన పాడేస్తాం. వాటిని మనం వ్యర్థంగా భావిస్తాం. కానీ, అసలైన పోషకాలన్నీ ఆ గుడ్డులోనే ఉన్నాయటని పరిశోధకులు తెలుపుతున్నారు. గుడ్డు పెంకులను కూడా ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం లభిస్తుందట. ఫలితంగా ఎముకలు, దంతాలు మరింత గట్టిపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

 గుడ్డు పెంకులను నేరుగా తినేయకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గుడ్డు పెంకు మీద అనేక బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయి. కాబట్టి పెంకులను వేడి నీటిలో కనీసం 20 నుంచి 30 నిమిషాలు మరిగించి, పొడిగా చేసుకుని తీసుకోవాలి. పెంకులు పెంకులుగా తీసుకుంటే అంతర్గత అవయవాలకు హాని కలగవచ్చు. పొడి చేసిన గుడ్డు పెంకులను రోజుకు అర టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే చాలు. శరీరానికి కావల్సిన 90 శాతం కాల్షియం లభిస్తుంది.


 గుడ్డు పెంకుల వల్ల ఎముకలు, దంతాలకు 1000 నుంచి 1500 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్-డి కూడా లభిస్తుంది. త్వరగా అలసిపోవడం, పనిలో చిరాకు, ఒత్తిడి లాంటి సమస్యలను కాల్షియం లేదా విటమిన్-డి లోపంగా భావించాలి. అలాంటివారు గుడ్డు పెంకు పొడిని నీళ్లు లేదా పాలలో కలుపుకుని తాగితే తగిన కాల్షియం శరీరానికి లభిస్తుంది. అత్యధిక కాల్షియం పిల్లలు, వృద్ధులకే అవసరం అవుతుంది.


గుడ్డు పెంకులను కేవలం బాగా ఉడికించిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. అప్పుడే దానిపై ఉండే బ్యాక్టీరియా పోతుంది.మీకు ఎంత కాల్షియం అవసరమో అంతే తీసుకోండి. అవసరానికి మించిన కాల్షియం తీసుకుంటే హైపర్కాల్సెమియా, కిడ్నీ డ్యామేజ్, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. గుడ్డు పెంకు పొడి వెనిగార్, నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్‌లో సులభంగా కరిగిపోతుంది.గుడ్డు పెంకు ఫౌడర్‌ను పిజ్జా, పాస్తా, మరేదైనా వంటకాల్లో వేసుకోవచ్చు. ఇది రుచిని ఏ మాత్రం మార్చదు.

మరింత సమాచారం తెలుసుకోండి: