భారత వంటకాలలో వంటింట్లో ఎక్కువగా వాడే పదార్థము పసుపు. ఇక ఈ భూమి మీద మంచి శక్తివంతమైన హెర్బల్ పౌడర్‌గా పసుపును గుర్తించారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేదంలో పసుపును మంచి ఔషధంగా వాడుతున్నారు. అలాగే ఎన్నో రోగాలకు కూడా పసుపు మంచి మందుగా పనిచేస్తుంది. ఇక తాజాగా జర్నల్ ఆఫ్ జనరల్ వైరాలజీ చేసిన ఒక అధ్యయనం ప్రకారం తెలిసిందేంటంటే పసుపులో ఉండే కర్కుమిన్ అనేది కొన్ని వైరస్లను తొలగించడానికి ఇంకా అలాగే ఇన్ఫెక్షన్ నుంచి కూడా రక్షించడానికి సహాయపడుతుందని తేలడం జరిగింది.ఇక కర్కుమిన్  ట్రాన్స్మిసిబుల్ గ్యాస్ట్రో ఎంటెరిటిస్ వైరస్ ని నిరోధించగలదని నిరూపించబడింది. ఇక ఈ వైరస్ ఎక్కువగా పందులలో కనిపించే వైరస్‌. కర్కుమిన్ ఈ వైరస్‌ కణాలను చంపుతుందని తేలింది.ట్రాన్స్మిసిబుల్ గ్యాస్ట్రో ఎంటెరిటిస్ వైరస్ అనేది ఒక అంటువ్యాధి. ఇది రెండు వారాల కంటే తక్కువ వయస్సు ఉన్న పందిపిల్లలకు సోకడం జరుగుతుంది. ఇక అంతేగాక ఇది చాలా ప్రాణాంతకమైనది కూడా.

కర్కుమిన్ వైరస్ అనేది కణాల సంఖ్యను కూడా తగ్గిస్తుందని వైద్యులు కనుగొనడం జరిగింది.ఇక పసుపులో ఉండే కర్కుమిన్ మధుమేహం, క్యాన్సర్ ఇంకా అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా వెంటనే తగ్గిస్తుంది. చాలా మంది కూడా ఈ రోజుల్లో ఎక్కువ సంఖ్యలో గుండె జబ్బులతో చనిపోతున్నారు. ఇక కర్కుమిన్ కారణంగా గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందని అనేక అధ్యయనాలలో వెళ్లడవడం జరిగింది.అలాగే కర్కుమిన్ క్యాన్సర్ పెరుగుదలను కూడా పూర్తిగా తగ్గిస్తుంది. ఇక అలాగే క్యాన్సర్ కణాలను తొలగించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇది మెటాస్టాసిస్‌ను కూడా వెంటనే తగ్గిస్తుంది. ఇక ఇది కాకుండా టైప్ -2 డయాబెటిస్‌ను కూడా తగ్గించడంలో కర్కుమిన్ ఎంతగానో తోడ్పడుతుంది.చూసారు కదా పసుపుతో ఎన్ని ప్రయోజనాలు వున్నాయో..కాబట్టి పసుపుని రోజు తినే పదార్ధంలో వాడండి. ఖచ్చితంగా అనేక రకాల రోగాల బారిన పడకుండా వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: