ఆగష్టు 29 వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ దినోత్సవాలైన తెలుగు భాషా దినోత్సవము, జాతీయ క్రీడా దినోత్సవాలను జరుపుకుంటున్నారు. ఏ సందర్బంగా ఈనాటి సంఘటనలను గుర్తుచేసుకుందాం. నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) 1842 ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్కి దత్తత ఇచ్చారు. ప్రపంచంలోని మొట్ట మొదటి మోటారు సైకిల్ కి 1885 లో గోట్‌లీబ్ డైమ్లెర్ పేటెంట్ తీసుకున్నారు. గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని 1898 లో స్థాపించారు. జపాన్ కొరియా పేరును ఛోసెన్గా 1910 లో మార్చారు. ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది. యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు 1915 లో జరిగిన  ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.ఫిలిప్పైన్స్ అటానమీ (స్వయంగా పాలించుకోవటం) చట్టాన్ని 1916 లో అమెరికా ఆమోదించింది. సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది  1930 లో  ఆ ప్రదేశాన్ని ఖాళీ చేశారు. క్క్కసి నుంచి  స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.





స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో 1944 లో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు. సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) 1949 లో కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది. స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. 1957 లో ఆ బిల్లు పాస్ అయ్యింది. కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ ప్రాంతంలో  1958 లో యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని ప్రారంభించారు. అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమి పైకి 1965 లో తిరిగి వచ్చింది. బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని 1966 లో అమెరికా, సాన్‌‍ఫ్రాన్సిస్కో లోని కేండిల్‌స్టిక్ పార్క్ వద్ద జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా శంకర్ దయాళ్ శర్మ 1984 లో   నియమితులయ్యారు. బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజును 1986 లో జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను 1991 లో ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది. 2005 లో సంభవించిన  హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా లలోని సముద్ర తీర పట్టణాలను నాశనం చేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. అంతేకాకుండా 1,000 మంది మరణానికి కారణమయ్యింది.




ఇక ఈరోజు జన్మించిన వారిని ఒకసారి గుర్తు చేసుకుంద్దాం..తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి 1863 లో జన్మించారు. అయన1940 మరణించారు. రాజనీతి పండితుడు, భారతీయ గిరజన జాతుల నేత వెరియర్ ఎల్విన్ 1902 లో జన్మించారు. ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ 1905 లో జన్మించారు. ఈయన 1979  లో మృతి చెందారు.  భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హీరాలాల్ గైక్వాడ్ 1923 లో పుట్టారు. అయన 2003  లో మరణించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 1926 లో పుట్టారు. పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని  రావు బాలసరస్వతీ దేవి 1928 లో జన్మించారు. అమెరికా సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్  1958 లో జన్మించారు. ఈయన 2009 లో మరణించారు.   ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు అక్కినేని నాగార్జున 1959 లో జన్మించారు.  




ఇదే సందర్భంలో ఈ రోజు అమరులైన వారిని గుర్తు చేసుకుందాం..ప్రముఖ సినిమా నటుడు, ఎన్. టి.రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ 2018 లో జరిగిన  కారు ప్రమాదంలో గాయపడి మరణించారు. అయన 1956 లో జన్మించారు.   మొఘల్ చక్రవర్తి హుమాయూన్ భార్యలలో ఒకరు మరియు చక్రవర్తి అక్బర్ తల్లి హమీదా బాను బేగం 1604 లో మృతు చెందారు. ఈమె 1527 లో పుట్టారు.   ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి 1950 లో మరణించారు. అయన  1888 లో జన్మించారు. బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు,పద్మ భూషణ పురస్కార గ్రహీత ఖాజీ నజ్రుల్ ఇస్లాం 1976 లో మరణించారు. ఈయనని 1960 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కార్ అవార్డు తో  గౌరవించించింది. అయన 1899 జన్మించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: