మాస్ మహారాజ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ క్రాక్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో ఆకట్టుకున్నాయి. పోతురాజు వీరశంకర్ అనే పాత్రలో రవితేజ అత్యద్భుత నటన, శృతి హాసన్ అందం అభినయం, మాస్ ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు, దర్శకుడు గోపీచంద్ మలినేని గొప్ప దర్శకత్వ ప్రతిభ, నెగటివ్ పాత్రలు చేసిన సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ల వండర్ఫుల్ పెర్ఫార్మన్స్ వెరసి క్రాక్ మూవీ కి అంతపెద్ద విజయాన్ని అందించాయి అనే చెప్పాలి.

ఇక ఇటీవల కొన్నాళ్ల నుండి ఈ మూవీ ఆహా ఓటిటి మాధ్యమంలో ప్రసారం అవుతున్నప్పటికీ కూడా అక్కడక్కడా పలు థియేటర్స్ లో క్రాక్ ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతున్నట్లు చెప్తున్నారు. అయితే దీని తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ తో ఒక భారీ సినిమా తీయనున్న దర్శకుడు గోపీచంద్, త్వరలో దానిని మొదలెట్టనున్నారని, ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారని అంటున్నారు. అయితే దీని తరువాత రవితేజ హీరోగా క్రాక్ సీక్వెల్ గా పార్ట్ 2 ని ఆయన తెరకెక్కిస్తారని అంటున్నారు. 

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా గోపీచంద్ మాట్లాడుతూ క్రాక్ కి సీక్వెల్ ఉంటుంది కానీ పక్కాగా ఎప్పుడు అనేది చెప్పలేను అని అన్నట్లు తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారాన్ని బాట్టి బాలయ్య సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన క్రాక్ మూవీ స్క్రిప్ట్ పై గోపీచంద్ పనిచేయనున్నారని, దానిని బట్టి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఆ మూవీ పట్టాలెక్కే చాన్సు కనపడుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది నిజంగా రవితేజ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: