యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ఛ‌త్ర‌ప‌తి సినిమా అంద‌రికీ తెలిసిందే. అప్ప‌ట్లో ఈ సినిమా క్రేజ్ బాగానే ఉండేది. ప్ర‌స్తుతం కూడా ప్ర‌భాస్ ఛ‌త్ర ప‌తి సినిమా కు క్రేజ్ ఎ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌భాస్ ఇండ‌స్ట్రీ వ‌చ్చిన మొద‌ట్లో పెద్ద హిట్ కొట్టిన సినిమా ల‌లో ఛ‌త్ర‌ప‌తి ముందు వ‌రుస లో ఉంటుంది. అయితే ఈ సినిమా లో ప్ర‌భాస్ చిన్న పిల్ల‌డిగా ఉన్నప్పుడు ఉండే పాత్ర ను ఒక అబ్బాయి వేశాడు. ఒట్టు వేసి ఒక మాట వేయ కుండ ఒక మాట చెప్ప న‌మ్మ అంటు తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ అబ్బాయి యే మ‌నోజ్ నందం. ఈ సినిమాతో చైల్డ్ ఆర్టీస్ట్ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.



ప్ర‌స్తుతం మ‌నోజ్ నందం పెద్ద వాడు అయ్యాడు. తెలుగు లో చాలా సినిమా ల‌లో ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపిస్తున్నాడు. ఆది సాయి కుమార్ న‌టించిన ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్ అనే సినిమా లో మ‌నోజ్ నందం ఒక ప్రధాన పాత్ర లో క‌నిపించాడు. ఫ‌రూఖ్ ఇక్బాల్ అనే టెర్ర‌రిస్ట్ పాత్ర లో మ‌నోజ్ నందం న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల నుంచి మ‌న్న‌ననులు పొందాడు. అలాగే 2019 లో వ‌చ్చిన జార్జ్ రెడ్డి అనే సిని మా లో కూడా మ‌నోజ్ నందం ఒక పాత్ర‌లో న‌టించాడు. ఈ జార్జ్ రెడ్డి సినిమా లో మ‌నోజ్ నందం అర్జున్ అనే పాత్ర లో నంటించాడు. అయితే ఈ  పాత్ర‌లో అద్భుతంగా న‌టించిన మ‌నోజ్ నందం గురించి తెలంగాణ టూడే లో ఒక సినీ విమ‌ర్శ‌కుడు గొప్ప గా రాశాడు. వీటి తో పాటు రిపబ్ల‌క్, రోమాటిక్ క్రిమిన‌ల్స్, వీర బోగ వసంత రాయ‌ల వంటి సినిమా లో నూ మ‌నోజ్ నందం న‌టించాడు.



అలాగే మ‌నోజ్ నందం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నటించిన అత‌డు సినిమా లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించాడు. ఈ సినిమా లో మ‌హేష్ బాబు చిన్న నాటి పాత్ర లో మ‌నోజ్ నందం న‌టించాడు. ఈ సినిమా తో కూడా మ‌నోజ్ నందం కు మంచి గుర్తింపు వ‌చ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: