యువ సెన్సేషనల్ యాక్టర్ విజయ్ దేవరకొండ తో ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీస్తున్న తొలి భారీ పాన్ ఇండియా సినిమా లైగర్. ఎంతో భారీ వ్యయంతో ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, పూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై అటు రౌడీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ సినిమా నుండి రాబోయే ఈ మూడు రోజుల్లో ఏకంగా నాలుగు అప్ డేట్స్ రెడీ చేసింది యూనిట్. వాటిలో ముందుగా రేపు అనగా డిసెంబర్ 29న ఉదయం 10 గం. 3 ని. లకు ఒక పెద్ద అనౌన్స్ మెంట్ వీడియో ని, అనంతరం తరువాతి రోజు డిసెంబర్ 30న ఉదయం 10 గం. 3 ని. లకు మూవీ నుండి ఎక్స్ క్లూజివ్ స్టిల్స్, అలానే అదే రోజు సాయంత్రం 4 గం. లకు ప్రముఖ మీడియా హ్యాండిల్ ఇన్స్టా లో స్పెషల్ ఫిల్టర్.

ఇక ఆఖరుగా ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న ఉదయం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న లైగర్ మూవీ ఫస్ట్ లుక్ అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో రౌడీ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా టీజర్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని లైగర్ టీమ్ అంటోంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించనుండగా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఇందులో ఒక కీలక రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగష్టు 25న విడుదల చేయనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: