టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా లైగర్. తొలిసారిగా ఈ సినిమా ద్వారా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో వర్క్ చేస్తున్నారు రౌడీ హీరో. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ, విజయ్ కి తల్లి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకడు పూరి జగన్నాథ్ ఈ సినిమాని రౌడీ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు టాక్.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా నటి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి అందరి నుండి మంచి స్పందన అందుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచింది. అయితే మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తుండడంతో ఎక్కడికక్కడ పలు సినిమా షూటింగ్స్ కూడా నిలిచిపోతున్నాయి, దానితో లైగర్ లేటెస్ట్ షెడ్యూల్ కూడా వాయిదా పడడంతో చేసేది లేక లైగర్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇంట్లో తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడుపుతున్నారు.

ఇక నేడు ఉదయం తన పెట్ స్టార్మ్ తో కలిసి సోఫాలో కూర్చుని ఉన్న తన ఫోటోని పోస్ట్ చేసిన రౌడీ, ప్రస్తుతం ఈ పరిస్థితి చూస్తుంటే మరికొన్నాళ్లపాటు షూటింగ్స్ జరిగేలా కనిపించడం లేదని, ఇక ప్రజలు అందరూ కూడా విధిగా కరోనా టీకాలు తీసుకుని, తప్పకుండా సోషల్ డిస్టన్సింగ్ పాటించి అవసరం ఉంటేనే బయటకు రావాలని అందరికీ విజయ్ విజ్ఞప్తి చేసారు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన లైగర్ మూవీ ఆగష్టు 25న రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో, విజయ్ కి పాన్ ఇండియా హీరోగా ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: