డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు , పూరి జగన్నాథ్,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  దర్శకుడిగా పరిచయం అయిన మొదటి సినిమా బద్రి తోనే  పూరి జగన్నాథ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు,  ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి , శివమణి ,  ఇడియట్ ,  పోకిరి ,  దేశముదురు , చిరుత , టెంపర్ , ఈ స్మార్ట్ శంకర్ లాంటి సినిమా లతో పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుడిగా ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాడు. 

దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు, ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది.  ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 150 కి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి,  ఆ సినిమాకు ఆటో జానీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలియజేశారు,  కాకపోతే ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది.  ఇది ఇలా ఉంటే చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే లేకపోయినా పూరి జగన్నాథ్ , చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు,  ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ చిత్ర బృందం  అధికారికంగా ప్రకటించింది, మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ను కాస్త లో మిస్ చేసుకున్న పూరిజగన్నాథ్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: