కాకపోతే ఎపుడు రొటీన్ గా ఎందుకు చేయాలి ఈసారి నా సినిమాకి ప్రమోషన్స్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి అనుకుని విమర్శల పాలయ్యారు నటుడు విశ్వక్ సేన్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నడి రోడ్డుపై ప్రాంక్ చేస్తూ బుక్ అయ్యారు. హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం మే 6 న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ యువకుడితో కలిసి ప్రాంక్ అంటూ హైదరాబాద్ నడిరోడ్డు పై నిలబడి గోలా గోల చేసి లాస్ట్ లో ఇది ప్రాంక్ అంటూ షాక్ ఇచ్చాడు. ఓ యువకుడు చేతిలో పెట్రోల్ డబ్బా పట్టుకుని కార్ లో వెళుతున్న విశ్వక్ సేన్ ను ఆపి అల్లం అర్జున్ ఎక్కడ అని ఒకటే విసిగిస్తుంటాడు. అయితే ఎలాగోలా అతడిని తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాడు విశ్వక్ ...అయితే అల్లం అర్జున్ కు ఇంకా పెళ్లి కాలేదని, అతడు కనుక ఇపుడు ఇక్కడికి రాకపోతే పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంటానని ఆ యువకుడు రోడ్డుపై రచ్చ రచ్చ చేస్తాడు.
నడిరోడ్డుపై ఇంత హంగామా జరగడంతో పెద్ద న్యూసెన్స్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి వివాదాలకు దారితీసింది. ఇక వీడియోపై స్పందించిన అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫుల్ ఫైర్ అయ్యారు. సినిమా ప్రమోషన్స్ పేరిట పబ్లిక్ ప్లేస్ లో ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఎంటి అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు ఇలా బహిరంగ ప్రదేశాల్లో జనాలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమోషన్స్ చేయకూడదని పోలీసులకు ఆదేశాలివ్వాలని హెచ్ఆర్సీలో చేశారు. ఇదే అంశం పై టీవి 9 లో యాంకర్ దేవి నాగ వల్లికి మరియు హీరో విశ్వక్ సేన్ కి మధ్య పెద్ద వివాదమే జరిగినట్లు తెలుస్తోంది.