తాజాగా సాయి పల్లవి మరియు రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం విరాట పర్వం.ఈ సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కాగా దీని అనంతరం వీరు వరుస సినిమాలలో నటిస్తు బిజీ బిజీగా ఉన్నారు.అయితే తాజాగా విరాట పర్వం చిత్ర ప్రమోషన్స్ లో సాయి పల్లవి చేసిన కామెంట్స్ తీవ్ర వివాదంగా మారాయి.అయితే సాయి పల్లవి మాట్లాడుతూ....సాయి పల్లవి నక్సలిజం, కమ్యూనిజం భావజాలం గురించి మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి కూడా కామెంట్స్ చేసింది.  కశ్మీర్ ఫైల్స్ చిత్రం వచ్చింది.ఇక  ఆ చిత్రంలో కశ్మీర్ పండిట్లని ఎంత దారుణంగా చంపారో చూపించారు.

అయితే  నేను ఇటీవల ఒక న్యూస్ చూశాను. కాగా ఆవుల్ని తరలిస్తున్న ముస్లింపై హిందువులు జై శ్రీరామ్ అంటూ దాడి చేశారు.అంతేకాదు కశ్మీర్ పండిట్లకి జరిగింది తప్పు అయితే.. గోవుల్ని తీసుకెళుతున్న ముస్లింలపై మనం చేస్తున్నది కూడా తప్పే అంటూ సాయి పల్లవి వ్యాఖ్యానించింది. ఇక  హిందూ వాదులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో సాయి పల్లవిపై విరుచుకుపడుతున్నారు.అంతేకాదు  ఆమెపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. కాగా కశ్మీర్ పండిట్లపై నరమేధానికి పాల్పడిన టెర్రరిరిస్టులని.. పవిత్రంగా పూజించే గోవుల్ని సంరక్షించే వారిని ఒకే గాడిన కడుతూ సాయి పల్లవి మాట్లాడింది అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

అయితే తాజాగా సాయి పల్లవి వ్యాఖ్యలపై సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి తాజాగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ....మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది.అంతేకాదు డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.... తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఇక ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? అంటూ విజయశాంతి సాయి పల్లవిని ప్రశ్నించింది.ఇకపోతే మనల్ని చుట్టూ ఉన్న సమాజం గమనిస్తోంది విషయాన్ని గుర్తుంచుకోవాలి.అంతకాక  చిన్న పొరపాటు చేసినా వేలెత్తి చూపే సమాజంలో ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు.అయితే సినిమా ప్రచారంలో భాగంగా పబ్లిసిటీ కోసం సాయి పల్లవిని అనవసరంగా ఈ వివాదంలో ఇరికించినట్లు  నాకు అనిపిస్తోంది...అంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: