ఇక మమ్ముట్టి వారసుడిగా మలయాళ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి.. వరుస సినిమాలతో స్పీడ్ గా దూసుకెళ్తున్నాడు దుల్కర్ సల్మాన్. ఆయన ఆ తరువాత తమిళ్ ఇండస్ట్రీపై కూడా దృష్టి పెట్టాడు.ఇక ఇప్పుడు టాలీవుడ్ ను కూడా టార్గెట్ చేశాడు. టాలీవుడ్ హీరో అనిపించుకోవాలి అని దుల్కర్ తెగ ఆరాటపడుతున్నాడు.అందుకే ఇక్కడ వరుసగా సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర కావడానికి ఎప్పటి కప్పుడు ప్రయత్నిస్తూనే వస్తున్నాడు. ఇక ఆ ప్రయత్నంలో భాగంగానే దుల్కర్ సల్మాన్ చేసిన ఫర్పెక్ట్ తెలుగు మూవీ సీతా రామం సూపర్ సక్సెస్ ను అందించింది.సీతారామం మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను సాధిస్తోంది. మంచి ఫీల్ గుడ్ మూవీగా ఆడియన్స్ మనసు దోచుకుంటుంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ నటన ఇంకా హ్యాండ్సమ్ లుక్స్ లేడీ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేశాయి. ఇక సీతారామం ఇచ్చిన జోష్ తో.. ఇకపై తెలుగులో వరుస సినిమాలు చేస్తానని దుల్కర్ సల్మాన్ చెప్పాడు. అలా అన్నట్టుగానే నెక్ట్స్ సినిమాను లైన్ లో పెట్టాడు యంగ్ హీరో.ఇక సీతారామం తరువాత ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ క్లాసిక్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఆయనకి ఒక చక్కటి కథను చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో దుల్కర్ సల్మాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని సమాచారం తెలుస్తోంది.


లవ్ స్టోరీ హిట్ తరువాత శేఖర్ కమ్ముల నుంచి ఇంతవరకూ కూడా మరో సినిమా రాలేదు. ధనుష్ హీరోగా ఒక సినిమా చేయడానికి అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా కాస్త లేట్ అయ్యే అవకాశం కనిపించడంతో ఇక ఈ లోపు దుల్కర్ తో సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు.ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ధనుశ్ ఇంకా తెలుగులో సార్ అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఆయనతో సినిమాకి ఇంకా సమయం ఉండటం వల్లనే, దుల్కర్ సల్మాన్ ను శేఖర్ కమ్ముల ఒప్పించినట్టు చెబుతున్నారు.ఇక శేఖర్ కమ్ములతో దుల్కర్ సల్మాన్ సినిమాను త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయితే దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ యంగ్ స్టార్స్ లిస్ట్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: