
ఇదిలా ఉండగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ కొన్ని వర్గాల వారికి మాత్రం నిరాశ మిగిల్చింది ఈ సినిమా అని చెప్పవచ్చు. అయితే అసలు విషయంలోకెళితే థియేటర్లలో సందడి చేసిన ఏ సినిమా ఇప్పుడు ఓటిటిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా .. అక్టోబర్ 28 మిడ్ నైట్ నుండి స్క్రీనింగ్ అవుతుందని స్పష్టం చేశారు. అయితే అది కూడా కేవలం పే - పర్ వ్యూ లోనే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం యూజర్లు పొన్నియన్ సెల్వన్ సినిమా చూడాలంటే రూ. 199 చెల్లించాలి.
కానీ నవంబర్ 4 నుంచి ప్రైమ్ యూజర్ లందరికీ ఉచితంగా చూడవచ్చని అమెజాన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి, కార్తీక్ ప్రధాన పాత్రను పోషించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ , మద్రాస్ టాకీస్ బ్యానర్లవారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మరి థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటిటిలో ఏ విధంగా విజయాన్ని అందుకుంటుందో చూడాలి.